April 3, 2013

అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు: శంకర్‌రావు

బాబుకు ప్రజల బ్రహ్మరథం

హైదరాబాద్: పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు అవినీతి అంశాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని ప్రశంసించారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌లోని విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే.. మరోసారి విద్యుత్ చార్జీలు పెంచడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. మ రోవైపు.. పాదయాత్రలో చంద్రబాబుకు జిల్లాల ప్రజలు బ్రహ్మరథం ప డుతున్నారని శంకర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అవీనితితో పాటు పలు అంశాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారన్నారు.