April 19, 2013
'గాలి' దోపిడీపై మా ఆరోపణలన్నీ నిజమే!: టీడీపీ
హైదరాబాద్: గాలి జనార్దనరెడ్డి గనుల దోపిడీపై తమ ఆరోపణలన్నీ
పూర్తి వాస్తవాలని సుప్రీం కోర్టు తీర్పుతో రుజువైనట్లు టీడీపీ
వ్యాఖ్యానించింది. ఈ మేరకు గురువారం ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్సీ
వై.బి.రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. గాలి దోపిడీ గురించి 2006
నుంచీ ఆధారాలతో చెబుతున్నామని, మైనింగ్ మాఫియా అక్రమాలపై పుస్తకం
ప్రచురించి పంపిణీ చేశామని గుర్తుచేశారు.
వైఎస్ అసలు కొడుకు...పెంపుడు కొడుకుల దోపిడీ గురించి ఇందులో సవివరంగా రాశామన్నారు. సుప్రీం తీర్పుతో అందులో ప్రతి అక్షరం నిజమని రుజువైనట్లు పేర్కొన్నారు. అలాగే జగన్కు, గజ్నవీకి చాలా పోలికలున్నాయని సుప్రీం కోర్టులో వివరించిన సీబీఐ న్యాయవాదికి కృతజ్ఞతలన్నారు.
వైఎస్ అసలు కొడుకు...పెంపుడు కొడుకుల దోపిడీ గురించి ఇందులో సవివరంగా రాశామన్నారు. సుప్రీం తీర్పుతో అందులో ప్రతి అక్షరం నిజమని రుజువైనట్లు పేర్కొన్నారు. అలాగే జగన్కు, గజ్నవీకి చాలా పోలికలున్నాయని సుప్రీం కోర్టులో వివరించిన సీబీఐ న్యాయవాదికి కృతజ్ఞతలన్నారు.
Posted by
arjun
at
7:26 AM