April 19, 2013
నేతలు కావాలంటే నోటిఫికేషన్ ఇవ్వండి
టీఆర్ఎస్కు టీడీపీ హితవు
హైదరాబాద్: "మీకు ఏయే నియోజకవర్గాల్లో నేతల అవసరముందో
పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల
వారికి ఎలాగూ అవకాశమిస్తారు కాబట్టి ఇప్పటికే మీ పార్టీలోని నేతలు వారి
దారి వారు చూసుకుంటారు'' అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు టీడీపీ అధికార
ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హితవు పలికారు. 'మీ
పార్టీలో ఉన్న నేతలు తెలంగాణను వదులుకోరు కాబట్టి టీఆర్ఎస్నైనా
వదులుకుంటారు' అని వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
10:02 PM