April 19, 2013
సీఎం నేవ్వే బాబూ..
నర్సీపట్నం : 'మాగోడు
పట్టించుకున్నవారెవ్వరూ లేరు...ప్రతి పనికి డబ్బులు ఇచ్చుకోవాల్సి
వస్తుంది...రాజకీయ అండదండలుంటేనే పనులు అవుతున్నాయి...తిరిగి మీరు
ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది...అందుకు మేమంతా సిద్ధంగా
ఉన్నాం...'అంటూ వృద్ధులు, మహిళలు, యువతీయువకులు ఇలా అన్నివర్గాల ప్రజలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు పలకడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త
ఉత్సాహాన్ని నింపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వరుసగా ఐదవ
రోజైన గురువారం కొనసాగిన చంద్రబాబు పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభించింది.
మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండలఅగ్రహారం,
మాకవరపాలెం, తామరం గ్రామాల్లో జరిగిన సభలకు ప్రజానీకం విశేషంగా హాజరయ్యారు.
దారిపొడవునా మహిళలు చంద్రబాబుకు హారతులుపట్టి తిలకం దిద్దారు. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు తమ భవిష్యత్తు గురించి చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం విశేషం. తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగ యువత, డ్వాక్రా మహిళలతోపాటు వృద్ధులు సైతం పేర్కొనడంతో చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
పాదయాత్రలో భాగంగా గురువారం తన ప్రసంగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వాటి పరిష్కారానికి భవిష్యత్లో ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారంనాటి పర్యటనలో బీ
సీలకు ప్రాధాన్యం ఇస్తూ 50 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళిక, అదేవిధంగా క్రీడాకారులకు, మహిళలకు, చేతివృత్తులవారికి తగిని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు.
ఖనిజ దోపిడీకి పాల్పడుతున్న పాలక పెద్దలు, రైతులు, ప్రజలకు అవసరమైన తాగు, సాగునీటిని కూడా దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న అన్రాక్పై తగు చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబ అవినీతిని సామాన్య ప్రజల కష్టాలతో పోలుస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.
Posted by
arjun
at
7:40 AM