April 19, 2013

టీడీపీ కమిటీలో మురళీమోహన్, ఏవీఎస్

హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న విశాఖలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లలో భాగంగా నియమించిన సాంస్కృతికకమిటీలో సినీ నటులు మురళీమోహన్, ఏవీఎస్ నియమితులయ్యారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, పార్టీ సాంస్కృతిక విభాగం నాయకుడు సాయిబాబా కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఆరుగురు నేతలతో మీడియా కమిటీ ఏర్పాటైంది. దీనికి పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు ఎల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరి స్తారు.