April 19, 2013

చికిత్స ఖర్చు పార్టీ భరిస్తుంది

మాకవరపాలెం
: తీవ్ర అనారోగ్యానికి గురైన తనకు చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారని గూడెంకొత్తవీధి మండలం గొందిపాకలు మాజీ సర్పంచ్ బౌడ గోపాలరావు తెలిపారు. గురువారం మండలంలోని చంద్రయ్యపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సర్పంచ్‌గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశానని, 15 ఏళ్ల నుంచి మండలంలో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డానని చెప్పారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చిందని, వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేదని వాపోయారు. దీంతో చంద్రబాబునాయుడిని కలిసి తన పరిస్థితి గురించి చెప్పానని, దీంతో స్పందించిన ఆయన చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు.