April 19, 2013

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: టీడీపీ

సికింద్రాబాద్: పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లను సత్వరమే పూర్తి చేయాలని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, సీఎం రమేష్ కోరారు. ఈమేరకు వారు దక్షిణ మధ్యరైల్వే జీఎం ఎంకే పాండేను శుక్రవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ఎంపీలందరు గత ఏడాది రైల్వే జీఎంను కలిసి ఓ వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని జీఎంను కోరామన్నారు. భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైనుకు నిధులు మంజూరైనా పనులు మొదలవకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.