April 19, 2013
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: టీడీపీ
సికింద్రాబాద్: పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్లను
సత్వరమే పూర్తి చేయాలని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, సీఎం రమేష్
కోరారు. ఈమేరకు వారు దక్షిణ మధ్యరైల్వే జీఎం ఎంకే పాండేను శుక్రవారం కలిసి
ఓ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీడీపీ ఎంపీలందరు గత ఏడాది రైల్వే జీఎంను కలిసి ఓ వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని జీఎంను కోరామన్నారు. భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైనుకు నిధులు మంజూరైనా పనులు మొదలవకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
టీడీపీ ఎంపీలందరు గత ఏడాది రైల్వే జీఎంను కలిసి ఓ వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని జీఎంను కోరామన్నారు. భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైనుకు నిధులు మంజూరైనా పనులు మొదలవకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
Posted by
arjun
at
10:01 PM