April 19, 2013

మిల్‌పిటాస్‌లో 20న చంద్రబాబు సంఘీభావ యాత్ర

శాన్ హొసె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించే లక్ష్య సాధనలో భాగంగా అందరూ చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించాలని బే ఏరియా టి.డి.పి. కోరింది. ఆంధ్ర ప్రదేశ్ బంగారు భవితవ్యంకోసం అందరూ శనివారంనాడు కదిలిరావాలని ఈ సంస్థ కోరింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ శనివారం మధ్యాహ్నం మిల్‌పిటాస్‌లోని సత్యనారాయణ ఆలయంలో పూజ జరుగుతుందని, ఆ తర్వాత సంఘీభావ యాత్ర జరుగుతుందని సంస్థ నిర్వాహకులు వివరించారు.
: తెలుగు దేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వస్తున్నా.. మీకోసం పాదయాత్ర 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో శనివారంనాడు సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నట్టు బే ఏరియా ఎన్.ఆర్.ఐ. టి.డి.పి. వెల్లడించింది.