December 29, 2012

తెలంగాణ కోసం బతికుండి పోరాడాలి...చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.



 
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు వద్దు.. బతికుండి పోరాడాల ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి చిట్యాల మండలం టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. గతంలో అనేకమార్లు తెలంగా ణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విద్యార్థులను కోరాం.. మరోసారి విజ్ఞ ప్తి చేస్తున్నా.. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దు, బతికుండి పోరాడాలి తప్ప తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని పేర్కొన్నారు. పంట గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రాష్ట్రంలో 22,500మంది ఆత్మహత్యల కు పాల్పడ్డారని, చావాల్సింది మనం కాదు.. చంపాల్సింది కాంగ్రెస్ పార్టీనని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలంగాణను అభివృద్ధి చేసింది టీ డీపేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌ను ఐదు జిల్లాలకు కలిపి రింగ్‌రోడ్డు నిర్మిం చి, విమానాశ్రయం ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు నిర్మించామన్నారు. కేసీఆర్ కుం భకర్ణుడని, ఆరు నెలలు ఫాంహౌజ్‌లో పడుకుని లేచి మాయమాటలు చెప్పి మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. అఖిలపక్షంలో తామే తెలంగాణపై స్ప ష్టం చేశామని, అందరూ టీడీపీ వైఖరి ని మెచ్చుకుంటుంటే కేసీఆర్‌కు మా త్రం కనిపించడం లేదన్నారు. పచ్చకామెర్లోడికి ప్రపంచమంతా పచ్చగా కనిపించినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో 9ఏళ్లుగా దొంగలు పడ్డారని, మనం చేసిన అభివృద్ధి ఫలాలను దోచుకుంటున్నారని ఆరోపించా రు. ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, అవినీతి మంత్రులను కాపాడేందుకు బిజీగా ఉన్నాడన్నారు.

మా హయాంలో రాష్ట్ర ఆదాయం రూ.8వేల కోట్లు ఉంటే రోడ్లు వేశాం.. ప్రాజెక్టులు కట్టించాం.. అనేక అభివృద్ధి పథకాలు చేపట్టాం అన్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ రూ.15 వేల కోట్లు ఉంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు అప్పులే మిగిలిపోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగాయని పేర్కొన్నారు. ఆడ పిల్లల అభివృద్ధి కోసం ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. రాని కరెంట్‌కు రెండు బుగ్గలు ఉంటే రూ.15వేలు రూ.16వేల బిల్లు వస్తుంద ని, కట్టకుంటే కేసులు పెడతామని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

పేదలు చదువుకునేందుకు ప్రభుత్వం కనీసం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భతి కల్పిస్తామని, అవసరమైతే వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలను ఆదుకునేందుకు ఎస్సీ వర్గీకరణ చేసి వారి ఇళ్లలో ఓ పెద్దమాదిగ అనిపించుకుంటానన్నారు. ఎన్‌టీఆర్ సుజల పథ కం ద్వారా అన్ని గ్రామాలకు గోదావరి జలాలు తాగిస్తామని పేర్కొన్నారు.

గ్రామాల్లో మందు ఫుల్.. మంచినీళ్లు నిల్‌గా మారిందన్నారు. గతంలో రూ.20 చీఫ్‌లిక్కర్ ఇప్పుడు రూ.100అయ్యిందని, మా ఆడపడుచులు సంపాదించిన డబ్బులు బెల్ట్‌షాపులకే పోతున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో బెల్ట్‌షాపులు రద్దు చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.600లు, వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. నియోజకవర్గానికో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, టీడీపీ వద్ధులను ఆదుకుంటుందన్నారు. ప్రతి నిరుపేదకు లక్ష రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టిస్తామన్నారు.

బీసీల అభివృద్ధి కోసం కషి చేస్తున్నామని, 143కులాలు ఉన్న బీసీ సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. బీసీలకు అసెంబ్లీలో వంద సీట్లు కేటాయిస్తామని తెలిపారు. వెనకబడిన తరగతుల వారు ఇప్పటికీ పల్లకి మోయడమే కాదు.. పల్లకి ఎక్కాలని తమ వర్గం వారు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటే తమ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. 500జనాభా దాటిన గూడెం, తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తానని పేర్కొన్నారు. ప్రతీ గిరిజన కుటుంబాలకు రెండు ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు. ముస్లింల అభివద్ధికి రూ.2,500కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.

63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తున్నానంటే ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకేనన్నారు. ఈ కార్యక్రమంలో టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, సత్యవతిరాథోడ్, ఎంపీ సుధారాణి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, పూజారి సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.