December 29, 2012

చలించిన బాబు



ఢిల్లీ సంఘటనపై బాబు తీవ్రంగా చలించిపోయారు. యువతి మృతికి సంతాప సూచన గా బాబుతో పాటు టీడీపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఆత్మశాంతికి రెండు నిముషా లు మౌనం పాటించారు. ఢిల్లీ సంఘటనకు బా ధ్యులైన దోషులను శిక్షించడంలో కేంద్ర ప్రభు త్వ వైఫల్యాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఈ సంఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసు బలగాలు బలప్రయోగం చేయడాన్ని ఖండించారు. దోషులకు ఉరిశిక్ష వేసినా త ప్పులేదన్నారు. పార్లమెంట్‌ను వెంటనే సమావే శ పరిచి చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు.