December 29, 2012

ప్రజలను పలకరిస్తూ...సమస్యలపై స్పందిస్తూ...



 
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయ్రాత జిల్లా లో తొలి రోజు (శనివారం) ప్రశాంతంగా జరిగింది. ఢిల్లీలో తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీలు వ్యక్తం చేసిన వైఖరులకు నిరసనగా శుక్రవారం ప్రదర్శనలు, దిష్టిబొమ్మల ద హనాలు జరిగింది తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. టీఆర్ఎస్ బంద్‌కు కూడా పిలుపు నిచ్చింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎలా జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అయింది. ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. అనుకున్న ప్రకారం ఆద్యంతం ఉత్సాహంగా, కోలాహలంగా సాగింది.


విలేకరుల సమావేశంలో...

బాబు తాను బస చేసిన వాహనం నుంచి సరిగ్గా 11 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో విలేకరుల స మావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా బాబు తన బస నుంచి బయటికి రాగానే పాదయాత్ర సాగే నియోజకవర్గం నాయకులతో కొద్ది సేపు సమావేశం అవుతారు. నియోజకవర్గం పరిధిలో ని సమస్యలపై చర్చిస్తారు. తర్వాత నేరుగా పా దయాత్ర మొదలు పెడతారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం తక్కువ. కానీ వెల్లంపల్లిలో మాత్రం విలేకరుల సమావేశంతోనే బా బు యాత్ర మొదలైంది. ఇప్పటి వరకు సాగిన పాదయాత్రలో బాబు రెండు సార్లు మాత్రమే వి లేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఒకసారి నీలం తుఫానుపై, మరో సారి ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి సంఘటన. ఇక్కడ మూడవ సారి ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి మృతి చెందిన సంఘటనపై విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

5 గ్రామాలు..13 కిమీ..

 సరిగ్గా 12 గంటలకు బాబు పాదయాత్ర మొ దలైంది. తొలి రోజు బాబు అయిదు గ్రామాల గుండా 13 కిమీ పాదయాత్ర చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మొగుళ్ళపల్లి మండాలలోని వెల్లంపల్లి, దుబ్యాల, రా ఘవరెడ్డి పేట, టేకుమట్ల, అంకుషాపురం గ్రా మాల మీదుగా పాదయాత్ర సాగింది. బాబుకు కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. పార్టీ పతాకాలతో ముందు నడిచారు. ఎమ్మార్పీ స్ కార్యకర్తలు కూడా తమ పతాకాలతో తోడు గా నడిచారు. బాబుకు ఇరువైపుల రక్షణ కవచంగా నిలిచారు. పాదయాత్రలో టీడీపీ కన్నా ఎమ్మార్పీస్ పతాకాలే ఎక్కువగా కనిపించాయి. మార్గంమధ్యలో ఎమ్మార్పీస్ కార్యకర్తలు బాబు కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ముం దు డప్పుచప్పుళ్ళతో కళాకారులు ముందు నడిచారు. మహిళలు బాబుకు ఎదురేగి మంగళహారతులు ఇచ్చారు. బోనాలతో నడిచారు. వెల్లంపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మగుడిని చంద్రబాబు దర్శించుకున్నారు.

సమస్యలపై ఆరా..

పాదయాత్ర సందర్భంగా గ్రామీణులు అనేక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చా రు. ప్రధానంగా కరెంట్ కోతలతో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. పండి న పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు. మార్గ మధ్యలో బాబు రైతులు, మహిళా కూలీలు, వృద్ధులుతో మాట్లాడారు. దు బ్యాలలో చిక్కినేని మల్హల్‌రావు అనే రైతులతో బాబు మాట్లాడారు. తనకున్న రెండెకరాలలో వేసిన పత్తి, వరి కరెంట్ కోతల వల్ల ఎండిపోయిందని ఆయన వాపోయాడు. కరెంట్ ఎప్పు డు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు.

మార్గంమధ్యలో కొంత మంది మహిళా వ్యవసాయకూలీలను కూడా కలిసారు. సంగి శారద, సంగి స్వరూప తమకు వేలల్లో కరెంట్ బిల్లులు వచ్చినట్టు ఫిర్యాదు చేశారు. ఏ ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఇళ్ళబిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. రోడ్డుపై నిస్సహాయంగా కూర్చున్న ఓ వృద్దురాలిని కూడా బాబు పరామార్శించారు. తనను చూసేవారు లేరని, వృద్ధప్యా పించన్ రావడం లేదని ఆ వృద్ధురాలు చెప్పింది. పాదయాత్రలో మిక్కినేని సర్వోత్తమరావు అనే రైతు పత్తిబస్తాతో ఎదురయ్యాడు. బాబు ఆ పత్తిబస్తాను తనతలపై పెట్టుకున్నారు. గిట్టుబాటు ధర లభిస్తుందా అని ఆరా తీశారు. పత్తిరైతు సమస్యను బాబు సావధానంగా విన్నారు. మధ్యలో గొర్రెలకాపర్ల సంఘం ప్రతినిధులు చంద్రబాబుకు గొంగడి కప్పి గొర్రెపిల్లను బహుమతిగా అందచేశారు. వారి సమస్యలను కూడా ఆలకించారు.