December 29, 2012

దోషులకు ఉరి వేసినా తప్పులేదు... చంద్రబాబు

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి చెందడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష విధించినా తప్పు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ మహిళలపై దేశంలో ఎక్కడో ఒకచోట దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే కేంద్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు ఈరోజు తెల్లవారు జామును సింగపూర్లో మరణించింది. మృత్యువుతో చివరి వరకూ పోరాడిన ఆమె కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలు భారతదేశంలోని స్వగ్రామంలో నిర్వహించాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించడంతో మృతదేహాన్ని సింగపూర్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.