December 29, 2012

దేశం' సంబరాలు..

తెలంగాణ ప్ర త్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా అఖిలపక్ష సమావేశంలో పార్టీ పక్షాన లేఖ అందివ్వడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.శుక్రవారం కరీంనగర్‌లో ఎమ్మెల్యే గం గుల కమలాకర్ అసెంబ్లీ కార్యాల యం వద్ద నగర, మండల పార్టీ అధ్యక్షులు గుగ్గిళ్ళపు రమేశ్, కాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. కార్యకర్తలు కేరింతలతో సందడి చేశారు. ఈ సందర్భంగా రమేశ్, శ్రీనివాస్ మాట్లాడు తూ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకులెవరో తేలిపోయిందన్నారు. ప్రజ లు మొదటి నుంచి తెలుగుదేశంపార్టీ వెంటే ఉన్నారని, ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ఏనాడూ వ్యతిరేకించలేదని, కావాలనే కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.



ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షుడు బత్తుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కొ మ్ముల కృష్ణ, మైనారిటీ సెల్ అధ్యక్షు డు ఇలియాజుద్దీన్, ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు లింగంపల్లి ఎల్లయ్య, మాజీ కా ర్పొరేటర్ పుట్ట నరేందర్, జంగిలి సాగ ర్, మంద రాజమల్లు, మల్లేశం, మారు తి, శ్రీధర్, గంగిపల్లి వెంకటేశ్వర్లు, ము జీబ్ రహమాన్, కనుకయ్య, గంగాధర లస్మయ్య, యాస్వాడ వెంకటరమణాచారి, మాచర్ల ఎల్లాగౌడ్, గొంటి సుధాకర్, అనసూయ, మణెమ్మ, భాగ్యలక్ష్మి, మామిడి రమేశ్, గూడెల్లి రాజ్‌కుమార్, రాజయ్య, పాల్గొన్నారు.