December 29, 2012

వరంగల్‌కు 'మీకోసం..'




తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ జిల్లాలోకి ప్రవేశించారు. చిట్యాల మండలం వెల్లంపల్లి వద్ద రాత్రి 8.30 గంటలకు ఆయన జిల్లాలో అడుగుపెట్టారు. గ్రామంలో అడుగుపెట్టిన సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.

మరోవైపు టీడీపీ పాతపాటే పాడిందని నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దిష్టిబొమ్మల దహనాలకు పాల్పడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. 2008నాటి లేఖకు కట్టుబడి ఉంటానని స్పష్టంగా చెప్పినప్పటికీ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడాన్ని టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. "బాబు పాదయాత్రను అడ్డుకుంటే.. ఖబర్దార్'' అని హెచ్చరిస్తున్నారు.