July 8, 2013

మోత్కుపల్లికి భద్రత కల్పించాలి : బాబు

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుకు అదనపు భద్రత పెంచాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. మోత్కుపల్లిపై హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బాబు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ కోర్టు ఆవరణలో ఏకే 47 అపహరణ కేసుపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు.