July 8, 2013

బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన బాబు

 సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలినఘటనలో మృతిచెందిన వారికి రూ.50 వేలు, గాయపడినవారికి రూ.10 వేలు ఇస్తామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఈ హోటల్‌ భవనం కూలి 12 మంది చనిపోగా, 18 మంది గాయపడిన విషయం తెలిసిందే. గాయపడినవారిని ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.