సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలినఘటనలో మృతిచెందిన వారికి
రూ.50 వేలు, గాయపడినవారికి రూ.10 వేలు ఇస్తామని టీడీపీ చీఫ్
చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఈ హోటల్ భవనం కూలి 12 మంది చనిపోగా, 18
మంది గాయపడిన విషయం తెలిసిందే. గాయపడినవారిని ఆస్పత్రిలో ఆయన
పరామర్శించారు.