July 8, 2013
వస్తున్నా మీకోసం పుస్తకం ఆవిష్కరణ
వస్తున్నా మీకోసం పేరుతో వేపిన పుస్తకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. దేశప్రధాని అయ్యే అవకాశం తనకు రెండు సార్లు వచ్చినా, రాష్ర్ట ప్రయోజనాల కోసమే ఆ పదవిని వదులుకున్నానని చంద్రబాబు అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో నాల్గు సార్లు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అందులో మూడు ప్రభుత్వాలు తెలుగుదేశం చొరవతోనే ఏర్పడినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. పాలకుల తప్పిదాల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో వనరులకు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం తప్ప స్వలాభం కోసం కాదని ఆయన హితవు పలికారు.
Posted by
arjun
at
11:09 PM