నల్గొండ: తనను చంపడానికి కుట్ర పన్నింది, రెక్కీ నిర్వహించిందీ కూడా
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు
అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతున్న కారణంగా తనపై
కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణకు అసలైన ద్రోహి కేసీఆర్నని
మోత్కుపల్లి విమర్శించారు.