July 8, 2013
తెదేపా అధికారంలోకి వస్తే రుణమాఫీపై తొలి సంతకం
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ
అధికారంలోకి రాగానే రైతులకు సంబంధించిన అన్నిరంగాల రుణాలను మాఫీ చేసేందుకు
తొలి సంతకం చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం
వరంగల్ జిల్లా కాజీపేట కాకతీయ ప్రాంగణంలో నాలుగు జిల్లా ప్రాం తీయ
సదస్సులో బాబు పాల్గొని పార్టీశ్రేణులకు గ్రామ పంచాయితీ ఎన్నికలపై దిశా
నిర్ధేశం చేశారు. వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎడబోయిన బస్వారెడ్డి
అధ్యక్షతన జరిగిన సదస్సుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్
జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎ త్తున హాజరయ్యారు.
ఈసందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్ళు
సమ కూర్చకుండా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, సామాన్య ప్రజల జీవితాలతో
ఆడుకుంటోందని, తాము అధికారం లోకి రాగానే బెల్టుషాపుల ఎత్తివేతకు రెండవ సంతకం చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచా యతీలు, స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని
చంద్ర బాబు ధ్వజమెత్తారు. పంచాయితీలకు ఎన్నికలు జరపకపో వడంతో గ్రామాల
అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన 4వేల కోట్ల నిధులు వెనక్కిపోయాయని
అన్నారు. ప్రజల తో పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ అభి వృద్ది
చేసిందీ లేదన్నారు. ప్రజల సొమ్మంతా కాంగ్రెస్ నేత ల జేబుల్లోకి పోతోందని,
వైఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోపిడీ
చేశాడని, దోచు కున్న సొత్తంతా కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకుంటు
న్నారని అన్నారు. జైలుకే పరిమితమైన పిల్ల కాంగ్రెస్కు ఓ టు వేస్తే జైలుకు
వెళ్ళే పరిస్థితే వస్తుందని వైఎస్సార్ సీపీని ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వసూళ్ళకు పాల్పడుతున్నదని, భవి
ష్యత్తులో పీఆర్పీని చిరంజీవి విలీనం చేసినట్లే కేసీఆర్ తెరా సను
కాంగ్రెస్ విలీనం చేయడం ఖాయమని అన్నారు.
తెలుగుదేశం తెలంగాణకు
వ్యతిరేకం కాదని మహానాడు లోనే తీర్మానం చేశామని చంద్రబాబు అన్నారు. అధికారం
లోకి వచ్చాక అమరుల కుటుంబాలను ఆదుకుంటామని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు
ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని ధరల
నియంత్రణ లేకపోవడంతో సామాన్యుల జీవనం కష్టాల పాలైందన్నారు. రైతులకు
అన్నివిధాలా అన్యాయం జరి గిందని అన్నారు. పంచాయితీ ఎన్నికలను ప్రతి
కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పంచాయితీల్లో తెదేపా
అభ్యర్థులను గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు. రా బోయే స్థానిక సంస్థల
ఎన్నికలు, సాధారణ ఎన్నికలపై పంచాయితీ ఎన్నికలు ప్రభావం ఉంటుందని ప్రతి
ఒక్కరు గమనించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని
శక్తి అని, నేటి కార్యకర్తలే రేపటి నాయకులను బాబు స్పష్టం చేశారు. తెలంగాణ
అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సదస్సులో
తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా
కర్రావు, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, గుండు సుధా రాణి, రాథోడ్ రమేష్,
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్రెడ్డి, ధన సరి అనసూయ, సత్యవతి రాథోడ్,
జగిత్యాల ఎమ్మెల్యే రమణ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీ ఎమ్మె
ల్యే ఇనుగాల పెద్దిరెడ్డి, గోడెం నగేష్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
2:49 AM