July 8, 2013
ఘటనాస్థలిని సందర్శించిన చంద్రబాబు
సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన ఘటనాస్థలిని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరుపై విచారణ చేయించాలన్నారు. ప్రమాద స్థలిలో సీఎం రెండు నిమిషాల పాటే ఉండి పోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. సీఎం, మంత్రులు ఘటనాస్థలిలో సహాయక చర్యలను పరిశీలించరా, వారికి ఆ బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.
Posted by
arjun
at
2:46 AM