July 8, 2013

మావోల రెక్కీ కెసిఆర్ కుట్ర: మోత్కుపల్లి

నల్లగొండ: దళితుడిని అయిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనను అంతమొందించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

కెసిఆర్ ప్రోద్బలంతోనే తనను హత్య చేయడానికి మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఆయన అన్నారు. మోత్కుపల్లిని అంతం చేయడానికి మావోలు రెక్కీ నిర్వహించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. తనను భౌతికంగా అంతం చేయడానికి కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తెరాసలో చేరిన మాజీ నక్సలైట్లు తనను హత్య చేసే కుట్రకు సూత్రధారులని ఆయన అన్నారు.