May 25, 2013

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం: చంద్రబాబు

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొత్తులు లేకుంటే టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గెలవలేదన్నారు. ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాంయాదవ్‌ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉపఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల్లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు.