May 25, 2013
కెసిఆర్పై తలసాని ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలో ఓటర్లు ఉచ్చ కూడా పోయరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తలసాని తీవ్రంగా ప్రతిస్పందిచారు.
తమ పార్టీ డివిజన్ స్థాయి నాయకులు కూడా కెసిఆర్ కన్నా పరుషంగా మాట్లాడగలరని ఆయన అన్నారు. కెసిఆర్ హుందాగా వ్యవహరిస్తే మంచిదని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. కెసిఆర్ కన్నా వందరెట్లు తాము బాగా మాట్లాడగలమన్నారు. చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడితే సంహించమని, కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని తలసాని హెచ్చరించారు.
Posted by
arjun
at
8:52 AM