May 25, 2013

కేసిఆర్ కుతంత్రాలు ఇక చెల్లవ్: చంద్రబాబు



తెలంగాణ ప్రాంతాన్ని వెనుక బడిన ప్రాంతాన్ని
అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలంగాణపై
2008లోనే తమ వైఖరి స్పష్టంగా చెప్పామని,
అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ
కూడా రాశామని తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు.
అసలు తెలంగాణ అంశంపై అఖిలపక్ష
సమావేశం నిర్వహించమని డిమాండ్ చేసిందే
తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అఖిలపక్షంలో
గతంలో తీసుకున్న వైఖరికే కట్టుబడుతూ లేఖ
ఇచ్చామన్నారు.
ఎన్నిసార్లు తెలంగాణపై స్పష్టత ఇచ్చినా..
టీఆర్ఎస్ ఉద్దేశ పూర్వకంగా బురద
జల్లుతూ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని
దీన్ని ప్రజలే తిప్పి కొడతారని పేర్కొంటున్నారు