May 25, 2013
కేసీఆర్.. నోటిని అదుపులో పెట్టుకో..!: టీడీపీ
తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును
తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత
కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి
శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం
నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద టీడీపీ నాయకులు కళ్లకు నల్లరిబ్బన్లు
కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంలా మార్చారని, ఇక టీఆర్ఎస్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిందన్నారు. కేసీఆర్కు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని బయటకు వెళ్లారని చెప్పారు. తెలంగాణ నినాదం పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న కేసీఆర్ నీతులు వళ్లించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా మార్చి పబ్బం గడుపుకుంటున్న ఆయనకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంలా మార్చారని, ఇక టీఆర్ఎస్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిందన్నారు. కేసీఆర్కు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని బయటకు వెళ్లారని చెప్పారు. తెలంగాణ నినాదం పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న కేసీఆర్ నీతులు వళ్లించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా మార్చి పబ్బం గడుపుకుంటున్న ఆయనకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు.
Posted by
arjun
at
8:48 AM