May 25, 2013

మా ప్రభుత్వంలో అవినీతి అంటే బయపడే వారు!


హైదరాబాద్: మహానాడు సన్నాహాలపై నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తూ, మంత్రులు జైలుకి పోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో అవినీతి రహిత పాలన అందించామన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతిపరులు భయపడేవారని, సామాజిక న్యాయం, మహిళలకు భద్రత కల్పించామని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందంటోన్న చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులెదురైనా కార్యకర్తేల అండగా నిలిచారని కొనియాడారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భ్రష్టు పట్టిందని, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని, భవిష్యత్తులో తృతీయకూటమిదే రాజ్యమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని పేర్కొన్న బాబు ఈ దిశగా మహానాడు సభకు ప్రత్యేక ప్రాధాన్యముందని చెప్పారు.