March 8, 2013

మహిళలకు చంద్రబాబు కితాబు

విజయవాడ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి చిదంబరం కంటే భారతీయ మహిళలే ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించగలరని చమత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కృష్ణా జిల్లా మండవల్లి మండలం చావలిపాడులో పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించి వారికి వరాలు ప్రకటించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఆడపిల్లల సంరక్షణ పథకం ప్రవేశపెట్టడమా..లేక పెళ్ళి ఖర్చులకు కొంత మొత్తం ఇస్తే బాగుంటుందా.. అని ఆలోచిస్తున్నానన్నారు. దీనిపై మహిళల అభిప్రాయం కోరగా.. ఆడపిల్లల సంరక్షణ పథకమే కావాలని చెప్పారు