March 8, 2013

టీడీపీ విస్త్తృతస్థాయి సమావేశం

రంగారెడ్డి అర్బన్ :ఈ నెల 9వ తేదీన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చెంపాపేట్‌లోని సామ సరస్వతి గార్డెన్స్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ టీ.దేవేందర్‌గౌడ్, రాష్ట్ర పరిశీలకులు, ఎంపీ రమేష్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శివర్గ వర్ల రామయ్యతో పాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొంటారని తెలిపారు.

ఈ సమావేశంలో సహకార సంఘాల ఎన్నికలు, పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంపై సమీక్షించనున్నట్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై, స్థానిక సమస్యలపై కార్యచరణ ప్రణాళికలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని ఆహ్వానించిన ముఖ్యనాయకులందరూ హాజరుకావాలని కోరారు.