March 8, 2013
కాంగ్రెస్ మా కడుపు కొట్టింది
మండవల్లి : బాబూ.. మీరే మాకు దిక్కు..
తెలుగుదేశం పార్టీ పాలనలో కొల్లేరు జీవనస్థితిగతులు మెరుగుపర్చేందుకు అండగా
ఉన్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి మీ వరకూ చేయూతనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్
కుట్ర చేసి నోటి వద్ద కూడు లేకుండా చేసింది. మండవల్లలో పాదయాత్ర చేస్తున్న
చంద్రబాబును కలిసి కొల్లేరు వాసులు దీనగాథను వినిపించారు.కొల్లేరును
నమ్ముకుని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 122 లంక గ్రామాల్లో మూడులక్షల
మంది ప్రజలు ఉన్నాం. వందలాది కుటుంబాలు జీవనోపాధిపొందుతున్నాం. కొల్లేరులో
చేపలు పట్టుకుని పట్టెన్నం తినే తరుణంలో కాంగ్రెస్ కన్నెర్ర చేసింది.
నోటిదగ్గర కూడును నేలపాలు చే సింది. కొల్లేరు ఆపరేషన్ పేరుతో పరిధిని మించి
చెరువులను ధ్వంసం చేశారు. అభయారణ్యం అంటూ అంక్షలు విధించారు.
చేపల వేటకు సైతం నిబంధనలు మాటున అడ్డుకుంటున్నారు. కొల్లేరులో జీవ నం సాగించటమే కష్టంగా మారింది. పొట్టచేతపట్టి, కొల్లేరును వదిలి, పొరు గు రాష్ట్రాలకు వలసలు వెళ్తాన్నాం. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అచరణలో అందరికి దక్కలేదు. అదనంగా ధ్వం సం చేసిన 7500 ఎకరాల మిగులు భూములు పంపిణీ చేస్తామని ఆశపెట్టారు. ఏదీ అమలు చేయలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగి ప్రభుత్వాల పై పోరాటం చేసిచేసి ఆలసిపోయాం. గమ్యం తెలియక సాగుతున్నాం. కొల్లేరులో పక్షుల కోసం అంటూ ప్రజలను బలిపశువులను చేస్తున్నారు. అభాగ్యులను అదుకోవటంలో వివక్ష చూపుతున్నారు. అని బాబుకు బాధితులు మొరపెట్టుకున్నారు.
Posted by
arjun
at
9:30 PM