March 8, 2013

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

పార్వతీపురం టౌన్- : టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్నా రు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 25వ వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. రెల్లివీధి, పెదమాదిగవీధులలో ప్రజలు సమస్యలను ఆయన ముం దు ఏకరవు పెట్టారు. దినదిన ప్రాణగండంగా ఇళ్ల ముందు విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యారని వారంతా వాపోయారు.

సామహిక మరుగుదొడ్లు లేక మహిళలు అవస్థలు పడుతున్నారన్నారు. కాల్వలు లేక మురుగునీరు నిలిచి వ్యా« దుల బారిన పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ కళ్లుండి చూడలేని ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిందన్నారు. పర్యటనలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కోలా వెంకటరావు, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి బార్నాల సీ తారాం, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మంచిపల్లి సత్యనారాయణ, పట్టణ సెక్రటరీ కోరాడ సింహాచలం, చందక దేశాలు, ఎం.సూర్యనారాయణ, మరియదాసు పాల్గొన్నారు.