March 11, 2013

కాంగ్రెస్‌ది నాటకం

  ఏలూరు : 'కాంగ్రెస్ తప్పుడు నాటకాలాడుతోంది. టీడీపీని దెబ్బతీయాలని చూ స్తోంది. ర్రాష్టాన్ని అడ్డగోలుగా మింగే సి, పందికొక్కుల మాదిరిగా తయారై న ఈ పార్టీలను నమ్మితే సర్వనాశనమే. తస్మాత్ జాగ్రత్త' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలను అప్రమత్తం చేశారు. పేదల సంక్షేమానికి పుట్టింది తెలుగుదేశం పార్టీ అయితే దోచుకోవడానికి, దాచుకోవడానికి తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు పో టీలుపడ్డాయని ఎద్దేవా చేశారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏకం గా మద్యాన్ని సరఫరా చేయడంలో పోటీపడుతోందని, పేదలతో ఆడుకుంటోందని విరుచుకుపడ్డారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు మూడోరోజు పెదఅమిరం నుం చి పెన్నాడ వరకు పదమూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మర థం పట్టారు. హారతులతో స్వాగతం ప లికారు. రోజువారీ ప్రసంగాల శైలిని ఆ యన కొంత మార్చి మూడో రోజు ప్ర జలకు ప్రశ్నలు సంధించడం, వాటికి తానే స్వయంగా జవాబులు ఇవ్వడాని కి ప్రాధాన్యత ఇచ్చారు.

కాంగ్రెస్ వ్యవహార శైలిని తప్పుబడుతూనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత గురించి మరీమరీ చెప్పారు. ' ఇంతకుముందు సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం ఆలోచిస్తే, ఎలా దోచుకుతిందామా అని కాంగ్రెస్ ఆలోచించింది' అని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన అన్నిచోట్లా ప్రస్తావించారు. అ ధికార కాంక్ష లేదని, ప్రజల కష్టాలను తీర్చేందుకే ఈ యాత్ర చేస్తున్నాని విడమర్చి చెప్పారు. కాళ్లు పీకుతున్నా, శరీ రం సహకరించకపోయినా మీ కష్టాల ను తీర్చాలన్న ఆశతోనే ముందుకు వె ళ్తున్నాని చెప్పారు. 'మీరు ఒక విష యం గమనించాలి. ర్రాష్టం ఇంతకుముందు ఎలావుంది, ఇప్పుడెలా ఉం ది.

ప్రజల ఆరోగ్యానికి ఐదున్నర వేల కోట్లు కేటాయించి, మద్యం ద్వారా 20 వేల కోట్లు రాబడుతున్నారు. దీంట్లో పరమార్ధాన్ని గ్రహించండి అంటూ ప్ర జలకు విజ్ఞప్తి చేశారు. తల్లికాంగ్రెస్, పి ల్ల కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయ ని, వీటిని చిత్తు చేయాలని విజ్ఞప్తి చేశా రు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే ఇప్పుడు కాం గ్రెస్ చేస్తున్న నష్టం అత్యంత ఘోరం గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది మంచో, ఏది చెడ్డో తెలుసుకునే చై తన్యం మీలో ఉంది. భీమవరం వంటి ప్రాంతం రాజకీయ చైతన్యవంతమైం ది. మీరందరూ కలిసొస్తేనే నేను చేస్తు న్న అవినీతిపై రాజీలేని పోరాటం విజయవంతం అవుతుందని అభ్యర్ధించా రు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వై ఎస్సార్‌సీపీ లాంటి పార్టీలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీపరంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, పార్టీ కార్యక్రమాలు వేరు, ప్రజా సేవ వేరని, తన పార్టీ శ్రేణులకు కూడా స్ప ష్టం చేశారు. పనిచేసే తత్వం అలవర్చుకోవాలని, అవినీతి పెరిగినప్పుడు ప్రజలే గట్టిగా నిలదీయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు అన్నిచోట్లా కనపడుతోందని అన్నారు. 'మమ్మల్ని కేసుల్లో ఇరికించడానికి రాజశేఖరరెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను నిజాయితీగా వ్య వహరించాను. ఏం చేసుకుంటారో చే సుకోండి అని నేను ఆనాడే చెప్పాను' అని భీమవరం బహిరంగసభలో అ న్నారు. పెదఅమిరంలో గుమ్మిగూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏది జరిగితే మనకేంటిలే అని వదిలేస్తే ఈ ర్రాష్టంలో ప్రజలెవరూ సుఖంగా బతకలేరని, అందుకే తాను చేస్తున్న ఆందోళనలో, పోరాటాల్లో కలిసి రావాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేర్కొంటూ 'నాకు అధికార కాంక్ష లేదు. దాని కోసం ప్రా కులాడటం లేదు. ర్రాష్టాన్ని ఒక గాట న పెట్టాలన్న తపనతోనే శారీరక కష్టాలను కూడా ఓర్చుకుని వేల కిలోమీటర్ల నడకను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన మూడో రో జు పాదయాత్రలో ఎక్కువగా స్థానిక సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ ఆరోపణల విమర్శల వేడిని కొం త తగ్గించి నేనేం చేయాలి, మీకేం కా వాలి అంటూ ప్రశ్నలు, సమాధానాలు రాబట్టారు.పెదఅమిరం, ఎస్ఆర్‌కె ఇం జనీరింగ్ కళాశాల ప్రాంగణం, ప్ర కా శం చౌక్‌లలో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన ప్రసంగాలను తగ్గించి సభికులకే ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో పలువురు తమ స మస్యలను ఏకరవు పెడుతూ వచ్చారు.