శింగనమల: తెలుగుదేశం పార్టీ
తరుపున ఎమ్మెల్సీ పదవిని శింగనమల నియోజకవర ఇన్చార్జ్ శమంతకమణికి ఇవ్వడంతో
మండల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం శింగనమలలో మండల
అధ్యక్షుడు అమ్మలదిన్నె చితంబరి దొర, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మాసూల
చంద్రమోహన్ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసే వ్యక్తికి ఎప్పుడైనా
పార్టీలో భవిష్యత్ ఉంటుందనే దానికి నిదర్శనంగా పామిడి శమంతకమణికి ఎమ్మెల్సీ
పదవి ఇవ్వడమన్నారు నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలతో కలసి ఎన్నో
కార్యక్రమాలు శమంతకమణి చేసిందన్నారు.