March 11, 2013

నిర్లక్ష్యం తగదు: నామా

భారతీయ రైల్వే ఆర్థిక పట్టాలు తప్పిందని, బడ్జెట్‌లో చెబుతున్న దానికి, చేస్తున్న దానికీ పొంతన లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. రైల్వే లైన్ల సాంద్రతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని, ప్రతి వెయ్యి కిలో మీటర్ల సగటు లైన్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌లో 18.2 కి.మీ.లే ఉన్నాయని, దీనిని బట్టే వెనుకబాటు తనాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది సమంజసం కాదన్నారు.