March 11, 2013
థర్మల్ విద్యుత్ ప్లాంట్ బాధితులకు టీడీపీ మద్దతు
రంగంపేట: థర్మల్ ప్రాజెక్టు
నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలవరం, దొంతమూరు ప్రజలకు టీడీపీఈ
మద్దతు ఉంటుందని రాజానగ రం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తెలిపారు. ఆదివారం
అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయా
గ్రామాల్లోని రిలే నిరాహర దీక్షా శిబిరాలను పెందుర్తి సందర్శించారు. థర్మల్
ప్రాజెక్టు నిర్మాణం వ ల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని శనివారం జరిగిన
డీఆర్సీ సమావేశం లో చర్చించామన్నారు. ప్రతి పో రాటానికి ప్రజల మద్దతు
ఉంటే విజయమ వుతాయన్నారు. ఇక్కడ విద్యుత్ ఉత్ప త్తి చేయడం కాకుండా బొగ్గు
దొరికే చో టే ఫ్యాక్టరీలు నిర్మించాలని పెందుర్తి సూచించారు.
అసెంబ్లీలో థర్మల్ ప్రాజె క్టు విషయాన్ని ప్రస్తావించనున్నట్లు పెందుర్తి తెలిపారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని, పార్టీ రహితం గా అందరూ పనిచేయాలని పెందుర్తి కోరారు. «థర్మల్ ఉద్యమ నాయకుడు పడాల రాము భార్య సునీత మాట్లాడు తూ ప్రాజెక్టు విషయాన్ని హోం మం త్రి సబితా ఇంద్రారెడ్డికి కాకినాడలో వివరించామన్నారు. థర్మల్ బాధితుల ను కలెక్టరేట్లోకి రాకుండా అనపర్తి ఎ మ్మెల్యే శేషారెడ్డి ఆపించారని, తనకు తెలిసిన వ్యక్తి ఉండడంతో హోం మంత్రిని కలిశానన్నారు.
అనపర్తి నియోజ క వర్గ టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు బాలవరం విషయాన్ని కృష్ణా జిల్లా పర్యటనలో వివరించామన్నారు.
కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీ కాంత్, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వాణిజ్య విభా గం కార్యదర్శి డి.లాజర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉద్దండ్రావు శ్రీనివాసరావు, ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు
Posted by
arjun
at
6:00 AM