March 11, 2013

నేడు టీడీపీ మహా ధర్నా

బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నారు. ఈపాటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆందోళనలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.