March 11, 2013

పార్టీని రక్షించండి

ఏలూరు :'పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లు, ఆస్తులను తెగనమ్ముకున్న వాళ్లు ఎంద రో ఉన్నారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని రక్షించుకోవడానికి మీలో ఎంతోమంది ఎన్నో తిప్పలు పడ్డారు. అసలు సమయం వచ్చింది. ఉన్న ఆ స్తుల్లోనే కొంత అమ్ముకున్నా సరే పా ర్టీని సంరక్షించుకుందాం. గెలిపించుకుందాం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా పెదఅమిరంలో బసచేసిన ఆయన సోమవారం ఉదయం ఏలూ రు, చింతలపూడి నియోజకవర్గాల ప నితీరును సమీక్షించారు.

ఈ రెండు ని యోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అసలు సంగతి మీరు చెప్పండి.. ఏం చేయాలో నేను చెబుతానంటూ ఆయన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల సమీక్ష సుమారు రెం డు గంటలకుపైగానే సాగింది. పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి పార్టీకి ఆ క్సిజన్‌లా ఉన్నారు. అప్పులపాలైన వా రు ఉన్నారు. చేతికి వచ్చే పంట ద్వారా వచ్చే ఆదాయంలో సగాన్ని పార్టీ కోస మే ఖర్చుపెట్టిన వారు ఉన్నారు. ఇదం తా తెలుగుదేశంలోనే సాధ్యం అని చం ద్రబాబు అన్నారు. మీ నియోజకవర్గా ల్లో పరిస్థితుల గురించి అన్నీ నాకు క్షు ణ్ణంగానే తెలుసు.

కానీ మీరు ఇప్పుడు ఉమ్మడిగా పార్టీ కోసం కలిసి పనిచేయాల్సిందే అంటూ సున్నితంగా వా ర్నింగ్‌లు ఇచ్చారు. ఇంతకుముందు పార్టీ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది, కార్యకర్తలు బలంగానే ఉన్నారు, నా యకులే కాస్త మారాలంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఏదో సమీక్షతో సరిపెట్టే ఉద్దేశం తనకు లేద ని, పార్టీకి పటిష్టవంతమైన నాయకత్వాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏలూరు, చింతలపూడి నియోజకవర్గా ల్లో పార్టీ పరిస్థితులపై ప్రత్యేకంగా ప్ర స్తావించకుండానే ఆయన ఎన్నో త్యా గాలు చేసి పార్టీని బతికించుకుంటూ వచ్చిన వారే ఇప్పుడు మరోమారు అ ప్రమత్తం కావాలి. ఉన్న దాంట్లోనే పా ర్టీ కోసం కూడా వినియోగించాల్సిన స మయం ఆసన్నమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి భవిష్యత్ ను నేను దగ్గరుండి చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

తెలుగుదేశం మాలలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉ న్నామని గుర్తు చేశారు. దీంట్లో ఎలాం టి అపోహలకు తావులేదన్నారు. చిం తలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వు డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ని యోజకవర్గ ఇన్‌ఛార్జి నియామకంతో పాటు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా ఈ వారంలోనే మీరందరూ సమావేశమై ఒక నిర్ణయానికి రండి అ ని చెప్పారు. మిగతా పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా తిప్పికొట్టాలి. అప్పుడే పార్టీ బలోపేతమవుతుందన్నారు. ఆరు నెలల ముందే అ భ్యర్ధులను ఖరారు చేస్తాను, వారు పనిచేసే తీరునుబట్టే తుది జాబితా కూడా ఉంటుందని ప్రకటించారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వారికే అవకాశం ఉంటుందని, సీనియర్లతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు అ వకాశమిస్తామన్నారు.

ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా తమ మనోభిప్రాయాలను అధినేత ఎదుట ఉంచారు. మీరు సీఎం కావాలి, మీ పాదయాత్ర మాకు స్ఫూర్తినిచ్చింది. మా నియోజకవర్గానికి కన్వీనర్‌ను నియమించండి. ఇక ఇప్పటి నుంచి నిద్రపోం, పార్టీని గెలిపించుకుంటాం అని లింగపాలెం మండలానికి చెందిన చలపతిరావు స్ప ష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఇంతకుముందు లింగపాలెంలో మీ మాదిరిగానే పాదయాత్రలు చేశాం. అ యితే పార్టీలో ఏమైనా అపోహలు ఉం టే కొందరు వాటిని మర్చిపోవాలి. మి మ్మల్ని సీఎంను చేసేలా వాళ్లూ కష్టపడాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరికి న్యాయం చేస్తారో అది మీ ఇష్టం అని వెంకటేశ్వరరావు అన్నా రు.

ప్రతి చిన్నదానికి మేమే ఖర్చులు బరాయించి పార్టీ కోసం కష్టపడుతు న్నాం. కన్వీనర్‌ను నియమించండి అని నవీన్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ మీరు పార్టీలో అంబేద్కర్ లాంటివారని కీర్తించారు. మాల వర్గాలకు నష్టం చేసేలా జగన్ వంటి నేతలు వర్గీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన జూపూడి ప్రభాకరరావు నోరెత్తలేకపోయారని, అయితే మేము మా త్రం వీటిని ఖండిస్తూ వచ్చామన్నారు. మాదిగలంతా పార్టీకే కట్టుబడి ఉన్నారన్న అపోహ అవసరం లేదని ఆయన పార్టీ అధినేతకు సూచించారు. ఏలూరులో పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నా రు.

ఆంజనేయులు ప్రసంగాన్న చంద్రబాబు సైతం అభినందించారు. వైశ్యులకు సముచిత న్యాయం చేయాలి మీ హయాంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వ చ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాకు ఎన్టీ ఆర్ పేరు పెట్టాలని పైడే టి రఘు సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారం ఎంతోమంది ఉన్నాం. మీరు సీఎం అయితే మాకు అదే పదిలేవు అని ఏలూరు కార్యకర్త మల్లెపు రాము అన్నారు. లీగల్ సెల్‌లో పనిచేస్తున్నాం. అనుబంద సంఘాలను కూ డా మీరు పరిగణనలోకి తీసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వరి తన అభిమతాన్ని చంద్రబాబు ముందుంచారు. సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మాగంటిబాబు, ఎమ్మెల్యే టి.వి. రామారావు, చింతమనేని ప్రభాకర్, అంబికా కృష్ణ, బడేటి బుజ్జి, కొక్కిరిగ డ్డ జయరాజు, పాలీ ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, ముళ్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు, ముత్తారెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.