March 11, 2013
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ
అభ్యర్ధులు యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి సోమవారం అసెంబ్లీ
కార్యదర్శికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్
బ్యూరో సభ్యుడు యనమల మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలను దృష్టిలో
పెట్టుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. పార్టీ
నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు.
టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల పక్షాన పోరాడటమే పార్టీ ఎజెండా అని యనమల వ్యాఖ్యానించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ఘాట్కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల పక్షాన పోరాడటమే పార్టీ ఎజెండా అని యనమల వ్యాఖ్యానించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ఘాట్కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
Posted by
arjun
at
5:39 AM