July 5, 2013
రాయచోటి తెదేపా పగ్గాలు రెడ్డినారాయణకే!
రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్ చార్జిలు
మద్దిపట్ల రెడ్డినారాయణకే అప్ప గించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉప
ఎన్నికల తర్వాత రాయచో టి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం
చేసే నేతలే కరు వయ్యారు. నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి నేత ఎవరోనని
సందిగ్ద ంలో ఉండిపోయారు. ఆ పరిస్థితుల్లో సంబేపల్లె మండలానికి చెందిన పారి
శ్రామికవేత్త రెడ్డినారాయణ ఆ పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు అండగా
నిలుస్తూవచ్చారు. ని యోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలతో
ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.
ఇన్చార్జి బాధ్యతలను ఆయనకు
అప్పగిస్తే పార్టీ పటి ష్టమ వుతుందని ఆ పార్టీ అభిమానులు ఆశిస్తూవచ్చారు.
ఇటీ వల పార్టీ అధి నేత చంద్రబాబునాయుడు కడప జిల్లాపై దృష్టిసారిస్తూ
రాయచోటి నియో జకవర్గంపై జిల్లా నేతలతో చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్య
క్రమాలకు గతంలో పనిచేసిన నాయకులు దూరంగా ఉండడంతో ఇక్కడ పార్టీ పరిస్థితి
ఇబ్బందికరంగా మారిందని తెలియజేశారు.ఈ పరిస్థితుల్లో అన్నివిధాలుగా
సమర్ధులైన రెడ్డినారాయణకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్ని
లతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు విలవుతుందని అదిష్టానం
భావిస్తున్నట్లు సమాచారం.
Posted by
arjun
at
12:07 AM