July 5, 2013

నీరందక రైతుల అల్లాడిపోతున్నారు : దేవినేని

కృష్ణా డెల్డాలో 15 లక్షల ఎకరాలకు నీరందక రైతులు అల్లాడిపోతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పులిచింతల, డెల్టా ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు. మద్యం టెండర్లతో మంత్రి పార్థసారథి డబ్బులు దండుకుంటున్నారని, సాగునీటి సలహా మండలి గురించి పట్టించుకోవడం లేదని దేవినేని ఉమా ఆరోపించారు.