April 9, 2013
హరికృష్ణ వ్యాఖ్యలు అర్ధరహితం : కోడెల
గుంటూరు : ఎన్టీఆర్ ఫోటో వివాదంపై నందమూరి హరికృష్ణ చే సిన
వ్యాఖ్యలు అర్ధరహితం అని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. మంగళవారం
ఉదయం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఏనాడూ ఎన్టీఆర్ ఫోటోను
పక్కనపెట్టలేదని తెలిపారు.
ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కోడెల పేర్కొన్నారు. అక్కమాస్తుల కేసులో హోంమంత్రి సబితను నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీీటుపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర కేబినేట్ దొంగలమయం అని ఆరోపించారు. చేవెళ్ల చెళ్లెమ్మ జైలుకు వెళ్లబోతోందన్నారు.
ప్రభుత్వ కార్యాక్రమాలతో పాటు చేవెళ్ల నుంచి వైఎస్ అవినీతి కార్యక్రమాలను ప్రారంభించారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు సిగ్గులేకుండా పదవులలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. తమ్ముళ్ల అవినీతి చూస్తే సీఎం ఎంత నీతిమంతుడో తెలుస్తుందని కోడెల శివప్రసాద్ ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కోడెల పేర్కొన్నారు. అక్కమాస్తుల కేసులో హోంమంత్రి సబితను నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీీటుపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర కేబినేట్ దొంగలమయం అని ఆరోపించారు. చేవెళ్ల చెళ్లెమ్మ జైలుకు వెళ్లబోతోందన్నారు.
ప్రభుత్వ కార్యాక్రమాలతో పాటు చేవెళ్ల నుంచి వైఎస్ అవినీతి కార్యక్రమాలను ప్రారంభించారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు సిగ్గులేకుండా పదవులలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. తమ్ముళ్ల అవినీతి చూస్తే సీఎం ఎంత నీతిమంతుడో తెలుస్తుందని కోడెల శివప్రసాద్ ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
4:55 AM