April 9, 2013

కాంగ్రెస్‌కు పాలించే హక్కు లేదు

కూడేరు: విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా మంగళవారం చే పట్టనున్న బంద్‌కు భారీగా తరలిరావాలని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. సోమవా రం శివరాంపేట గ్రామంలో విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా పల్లెలో విద్యుత్ కోతలు ఎత్తివేయాల నీ, వ్యవసాయానికి సక్రమంగా కరెం టు ఇవ్వాలని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఎమ్మె ల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పా లనలో రాష్ట్రం అంధకారంలోకి వె ళ్ళిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాలించే హక్కు లేదనీ, ప్రజలు ఏక మై బంద్‌లో పాల్గొనాలన్నారు. ఉరవకొండలో చేపట్టే బంద్‌కు భారీగా తరలిరావాలన్నారు. కార్యక్రమంలో టీడీ పీ జిల్లా ఉపా«ధ్యక్షుడు శ్రీధర్‌చౌదరి, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, కూచె నాగరాజు, మురళీ, మండల కన్వీనర్ దేవేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు.