April 9, 2013

ప్రజా సమస్యలపై టీడీపీ పోరు

అనంతపురం అర్బన్: తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ఉద్యమానికి సిద్ధమైంది. ఉద్యమ కార్యాచరణపై ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అత్యవసర సమావేశమై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ ఎ మ్మెల్యే బీకే పార్థసారథి, పొలిట్‌బ్యూ రో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, ఎ మ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉన్నం హనుమంతరాయచౌదరి, పేరం నాగిరెడ్డి, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీ వీ వెంకటరాముడు తదితరులు సమావేశమై చర్చించారు.

ముఖ్యంగా జిల్లా లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, విద్యుత్ కోతలు, విద్యు త్ చార్జీల పెంపు, ఉపాధి హామీ పను లు, పంటనష్ట పరిహారం, బీమాలో జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15,16 తేదీ ల్లో అన్ని మండల కేంద్రాల్లో భారీ ధ ర్నాలు నిర్వహించాలని నిర్ణయించా రు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 22న చలో కలెక్టరేట్ ని ర్వహించి కలెక్టరేట్‌ను దిగ్బంధించాల ని నిర్ణయించారు. అనంతరం ఆ పార్టీ నాయకుల సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

మంత్రులు, అధికారులు కేవలం మా టలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కరెంట్ కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారని దీనివల్ల పంటలు ఎ ండిపోతున్నాయన్నారు. పంట నష్టపరిహారం, బీమా జాబితా తయారీలో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జాబితా త యారీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే అనేక గ్రామాల నుంచి ఫిర్యాదులందాయన్నారు. వా తావరణ బీమా పేరుతో జిల్లా రైతుల ను దగా చేశారని మండిపడ్డారు. నా ణ్యమైన విత్తన వేరుశనగ సేకరణ ఇ ప్పటికే జరగాల్సి ఉన్నా ఎలాంటి చ ర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నా రు. విత్తన సేకరణలో కూడా కాంగ్రెస్ వర్గీయులు చేరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

రైతులు అడిగే విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పట్ల ప్ర జలు విశ్వాసం కోల్పోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. బంద్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.