April 17, 2013

టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

బైరెడ్డిపల్లె: తెలుగు దేశం ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య పేర్కొన్నారు. చిత్తూరు ఎంపిీ శివప్రసాద్ బైరెడ్డిపల్లె మండలానికి మంజూరు చేసిన 189వీధి దీపాలను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ వీధి దీపాలను ఆయా గ్రామ కార్యదర్శులు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చంద్రబాబు సిీఎం అయిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపిీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులురాజన్న, వెంకట్రమణగౌడు, అమరనాధరెడ్డి, షౌకత్, వెంకటప్పగౌడు, సుబ్బు, సుబ్రమణ్యంరెడ్డి, గౌరప్ప అబ్దుల్ రహీం, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పలమనేరులో.. పలమనేరు మండలంలోని పదిపంచాయతీల్లో మెర్క్యురి వీధిదీపాలు వేసేందుకు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ నిధులు మంజూరు చేశారు. ఒక్కపంచాయతీలో తొమ్మిది వీధి దీపాల చొప్పున ఏర్పాటు చేసిన మె ర్క్యురీ దీపాలను మంగళవారం ఎ మ్పీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, పంచాయతీ సెక్రటరీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్వీ బాలాజీ, ఆర్బీసి కుట్టి, అములు, మల్లీశ్వర రెడ్డి, బాలాజీ నాయుడు, జగదీష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గంగవరంలో...గంగవరం మండలంలోని పంచాయతీలకు చిత్తూరు ఎం పీ ప్రభుత్వ నిధుల నుంచి వీధి దీపాలను మంగళవారం పంపిణీ చేశారు. మండలంలోని ఒక్కొక్క పంచాయతీకి రూ 20వేలతో 9దీపాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ భాస్కర్, కార్యదర్శులు తెలుగు దేశం మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య సుభాష్ చంద్రబోస్, శ్రీనివాసులు నాయుడు, మురళీ, హరి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.