April 17, 2013
సమాజ సేవలో టీడీపీ ముందంజ
తాండవ నీరు మర్రిపాలెంకు ఇవ్వాలని వినతి తాండవ రిజర్వాయర్ నీరు మర్రిపాలెం ఆయకట్టు రైతులకు ఇవ్వాలంటూ తెలుగు యువత కార్యదర్శి గవిరెడ్డి శివ ఆధ్వర్యంలో గ్రామస్థులు మంగళవారం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న వల్సంపేట గ్రామం నుంచి పైపులు ద్వారా తమ పొలాలకు సాగునీరు అందించాలని వీరు కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈసమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబునాయుడు మర్రిపాలెం గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఈసందర్భంగా గుమ్మిడిగొండ గ్రామానికి చెందిన బయలపూడి చంటిబాబు మాటాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. గుమ్మిడిగొండకు చెందిన వర్రే అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ, నేడు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Posted by
arjun
at
5:34 AM