April 17, 2013

జగన్ ములాఖత్‌లపై విచారణ: యనమల

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్‌కు సంబంధించి చంచల్‌గూడ జైల్లో ములాఖత్‌లపై విచారణ జరిపించాలని సీఎం కిరణ్‌ను టీడీపీ ఎమ్మెల్సీ

జైలు సూపరింటెండెంట్‌తో పాటు ఇతర సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆరోపించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిందితులకు ములాఖత్‌లు ఇవ్వడంలో చంచల్‌గూడ జైలు సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో విచారణ జరిపించాలని సూచించారు.
యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.