April 8, 2013

ఇల్లు కాల్చి చుట్ట ముట్టించుకుంటారా?

ఒకప్పుడు వీళ్లను మంచినీళ్ల బావుల దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఊరి చెరువుపై వీళ్ల నీడ కూడా పడనిచ్చేవారు కాదు. ఆ తరువాత రాజ్యాలు పోయి.. రాజ్యాంగం వచ్చింది. కానీ, ఈ ఎస్సీ కాలనీలు అప్పుడు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడూ అక్కడే ఉన్నాయనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అప్పుడే మెరుగేమోనని కూడా అనిపిస్తోంది. అప్పట్లో దూరం పెట్టినా.. నీళ్లయితే ఏదోలా తెచ్చుకునేవారు.. ఇప్పుడు ఎన్ని దూరాలు నడిచినా చుక్క నీరు పుట్టడం లేదు.

చెరువుల్లోకి దిగినా నీటిచెమ్మ కాలికి తగలడం లేదు. టి.తిమ్మాపురంలో రెండు రోజులుగా నేను చూసినదీ, వాళ్లతో వీళ్లతో మాట్లాడి తెలుసుకున్నదయితే ఇదే. కుక్కనుంచి తప్పించుకుంటే నక్క సిద్ధంగా ఉంటుందన్నట్టు.. కుల వివక్షను ఎంతో కొంత తప్పించుకొని ముందుకొచ్చిన ఈ జాతిని జాలిలేని పాలకులు పట్టపగలే దోచేస్తున్నారు. ఈ కాలనీవాళ్లూ నీళ్లు కొంటారు. కానీ, తాము తాగేది తక్కువ.. పసరాల గొంతు తడిపేది ఎక్కువగా ఉండటం నేను చూశాను. మూగ జీవుల మీద ఇంత జాలి గల మనుషులపై ఈ పాలకులకు మాత్రం జాలి లేదు.

మొండి గోడలు.. కప్పు లేని ఇళ్లు..కాలనీలోని చాలామంది 'గూడు' ఇదే. ఇలాంటి ఇళ్లు ఒక 15 దాకా చూశాను. ఎందుకిలా? 'ఏం చేయమంటావయ్యా..! మా దగ్గర ఉన్న

బతికినంత కాలం చాకిరీ చేస్తూనే బతికామని, సొంత కొంపలో కన్ను మూయాలన్న కోరిక కూడా తీరేటట్టు లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మాత్రం ఇల్లు వేసుకోవడానికి కూడా అప్పు చేయాల్సి వచ్చిందని మరికొందరు చెప్పుకొచ్చారు. దానికి నెల వాయిదాలు కట్టడానికే కూలీ చాలడం లేదని ఓ ఆడపడుచు కళ్లు ఒత్తుకుంది. ఇల్లు కాల్చి చుట్ట ముట్టించుకునేవాడికీ, ఈ పాలకులకూ తేడా ఉందా?
డబ్బులతో ఇంటిని ఇంతవరకే లేపగలిగాం. ఆదుకుంటామన్న సర్కారు ముఖం చాటేసింది. ముందు కట్టుబడి మొదలుపెట్టండి.. బిల్లులు తరువాత ఇస్తాం అన్న అధికారులు కనిపించడం మానేశారు'' అని ఓ వృద్ధుడు వాపోయాడు.