April 8, 2013

ఆశీర్వదించండి రామారాజ్యం తెస్తా..

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అ ధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు వస్తున్నా మీకోసం కా ర్యక్రమంలో తుని నియోజక వర్గ పరిధిలోని తొండంగి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం నిర్వహించిన పాదయాత్రకు అనూహ్య స్పందన ల భించింది. చంద్రబాబు ఈసారి పాదయాత్రలో ప్రయోగాలు చేశారు. దారిపొడవునా ఉన్నా వివిధ వ్యాపారులు, కూలీలు, ప్రయాణీకులు, ఆటో డ్రైవ ర్లు, స్వీపర్లు, మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు, పూజారులు వంటి వర్గాలతో ఆయన సంభాషించారు. సెక్యూర్టీనీ కూడా పట్టించుకోకుండా రోడ్డు సమీపంలోని కాలనీలో, ఇళ్లలోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు.

ఎ.కొత్తపల్లి గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలోకి వెళ్లడంతో అక్కడ మహిళలు పిల్లలు, వృద్ధులు గబాగబావచ్చి చంద్రబాబుకు కుర్చీ వేయడం కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ ఒక కుర్చీకూడా సరిగ్గా లేకపోవ డంతో ఒక పెద్దాయన నులక మంచం రోడ్డు పై వేయడంతో చంద్రబాబు ఆమంచంమీదే కూర్చున్నారు. ఆయన తన పక్క న వృద్ధులను పిల్లలను కూర్చోబెట్టుకుని అక్కడ సమస్యల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ హయాంలో ఇక్కడ కాలనీ నిర్మించి ఇల్లు ఇచ్చారన్నారు. కాని ఇవాళ కొత్తవారెవ్వకీ ఇల్లు ఇవ్వ డం లేదని నిత్యావసర సరుకుల ధర లు విపరీతంగా పెరిగిపోయాయని తాము బతకడమే కష్టమవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వృద్ధురాలు చంద్రబాబును తమ బతుకులు బాగుచేయాలని కోరగా ఆయన ఆమెను ఓదార్చి ప్రజల కన్నీళ్ళు, కష్టా లు తెలుసుకోవడం కోసమే తాను ఈ పాదయాత్రకు వచ్చానని కాళ్ళు నొప్పు లు వస్తున్నా పట్టించుకోకుండా ప్రజల కష్టాలు అర్ధం చేసుకుంటున్నానన్నారు. మీరంతా అవినీతి, ప్రజావ్యతిరేక కాం గ్రెస్ ప్రభుత్వంపైనా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అతని కొడుకు అవినీతిని తెలుసు కుని దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో అర్ధం చేసుకోవాలన్నారు.

మీ రంతా తనను ఆశీర్వదిస్తే రామరాజ్యం తీసుకువస్తానన్నారు. అంతకుముందు శారదా విద్యానికేతన్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంత రం అన్నవరం దేవస్థానం అర్చకులతోను, బ్రాహ్మణ వర్గీలతో చర్చించారు. సెజ్‌ల పేరిట భూములు కోల్పోయిన బాధితులు చంద్రబాబు వద్దకు వచ్చి తమను ఆదుకోవాలని కోరగా ఆయన స్పందించారు. అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహి స్తూ ఇటుక బట్టీల కార్మీకులతోను, ఆటోడ్రైవర్లతోను, స్వీపర్లతోను మాట్లాడారు.ఎ.కొత్లపల్లి వద్ద ఉమర్అలీషా భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి శృంగవృక్షం గ్రామానికి చేరే స మయంలో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యాత్ర ప్రారంభించారు.

శనివా రం గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, వలసపాకల అగ్రహారం, పి.ఆ గ్రహారం మీదుగా టి.తిమ్మాపురం వర కూ 9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వ హించారు. ఆయన వెంట టీడీపీ పొలి ట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, నియోజక వర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు.

రాజమండ్రి: రాజకీయ నేతలంటే యనమల రామకృష్ణుడులా ఉండాలని ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా పలు మంత్రి పదవులు చేసి నా కీలక పదవులు పోషించినా నిజాయి తీ, సచ్చీలుడుగా ఉండాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఆయనలో అవినీతి లేదని చెప్పారు. కాని వైఎస్ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే లక్ష కోట్లు దోచుకుని కొడుక్కి అప్పగించారని విమర్శించారు.