April 8, 2013
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే కట్టుబడి ఉంటాను: జూనియర్
నాకు సంబంధంలేని వివాదాల్లోకి లాగొద్దు!
హైదరాబాద్ : "అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నాది ఒకే మాట! నా
వంట్లో నందమూరి రక్తం ప్రవహిస్తోంది. తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే
కట్టుబడి ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీల
వివాదంపై సూటిగా స్పందించకుండా... 'నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను
లాగొద్దు' అని కోరారు.
సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన 'బాద్షా' విజయోత్సవ సభలో జూనియర్ పాల్గొన్నారు. తన ఫొటోలను వైసీపీ నేతలు వాడుకోవడం గురించి మీడియా ప్రస్తావించగా... "బాద్షా సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఇప్పుడు నన్ను వివాదాల్లోకి లాగి ఆ ఆనందాన్ని దూరం చేయకండి. నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను లాగొద్దు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చెప్పినా ఒక్కటే! నా అభ్యున్నతికి కారణమైన మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగా ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన 'బాద్షా' విజయోత్సవ సభలో జూనియర్ పాల్గొన్నారు. తన ఫొటోలను వైసీపీ నేతలు వాడుకోవడం గురించి మీడియా ప్రస్తావించగా... "బాద్షా సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఇప్పుడు నన్ను వివాదాల్లోకి లాగి ఆ ఆనందాన్ని దూరం చేయకండి. నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను లాగొద్దు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చెప్పినా ఒక్కటే! నా అభ్యున్నతికి కారణమైన మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగా ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
Posted by
arjun
at
9:48 PM