March 20, 2013

రోజూ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్ష

రోజూ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలతో పార్టీ స్థితి, గతులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సమీక్ష నిర్వహించి..ఆ తర్వాత కొంతసేపు భోజన విరామం.. విశ్రాంతి ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రలో భాగం గా మధ్యలో ముఖ్య కూడళ్లలో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, రైతులు, వివిధ వృత్తుల వారితో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడతారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు.