March 20, 2013

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల వినతి పత్రం

హైదరాబాద్ : బెనిటా సంస్థ ఉద్యోగి వీరభద్రారెడ్డి మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం టీడీపీ నేతలు దేవినేని ఉమా, శ్రీరాం తాతయ్య మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కేసు దర్యాప్తులో పురోగతి లేదన్నారు. వీరభద్రారెడ్డి మృతి వెనుక బ్రదర్ అనిల్ హస్తం ఉందని వారు ఆరోపించారు. అనిల్ ఆస్తులపైనా సీబీఐ విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు.